2: SPORTS
OFM
, Publish Date - Jun 18 , 2025 | 05:40 AM
భారత క్రికెట్ జట్టు తొలి టెస్టు కోసం రైలు మార్గంలో లండన్ నుంచి లీడ్స్కు చేరుకొంది. మామూలుగా టీమిండి యా ఎక్కడ దిగినా అభిమానులు భారీ సంఖ్యలో అభివాదం చేస్తూ...
లీడ్స్: భారత క్రికెట్ జట్టు తొలి టెస్టు కోసం రైలు మార్గంలో లండన్ నుంచి లీడ్స్కు చేరుకొంది. మామూలుగా టీమిండి యా ఎక్కడ దిగినా అభిమానులు భారీ సంఖ్యలో అభివాదం చేస్తూ కనిపిస్తుంటారు. అయితే లీడ్స్లో మాత్రం పట్టుమని పదిమంది ఫ్యాన్స్ కూడా కనిపించలేదు. బెకెన్హామ్ను బేస్గా చేసుకొన్న టీమిండి యా.. భారత్-ఎతో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడింది. కాగా, పేసర్ హర్షిత్ రాణాకు భారత జట్టులో చోటుదక్కింది. దీంతో అతడు జట్టుతో కలసి లీడ్స్కు చేరుకొన్నాడు. తొలుత ప్రకటించిన టీమ్లో రాణాకు చాన్స్ లభించలేదు. కానీ, భారత్-ఎ తరఫున ఆడేందుకు అతడు ఇంగ్లండ్ వెళ్లాడు. అయితే, మరో పేసర్కు కవర్గా రాణాను అక్కడే ఉండి పొమ్మన్నట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఆస్ట్రేలియాతో సిరీస్లో రాణా టెస్టుల్లో అరంగేట్రం చేశాడు.
ఇవీ చదవండి:
గిల్-పంత్తో కోహ్లీ మీటింగ్
బుమ్రా సంచలన వ్యాఖ్యలు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి