2: SPORTS
OFM
, Publish Date - Jun 18 , 2025 | 05:48 AM
భారత టెస్టు జట్టు కొత్త సారథి శుభ్మన్ గిల్పై ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ యువ ఆటగాడి నాయకత్వం స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీల మిశ్రమంగా...
లండన్: భారత టెస్టు జట్టు కొత్త సారథి శుభ్మన్ గిల్పై ఇంగ్లండ్ స్టార్ ప్లేయర్ జోస్ బట్లర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ యువ ఆటగాడి నాయకత్వం స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కెప్టెన్సీల మిశ్రమంగా ఉంటుందని అన్నాడు. ‘గిల్ ప్రతిభావంతుడు. మాట్లాడే సమయంలో ప్రశాంతంగా, కచ్చితత్వంతో ఉంటాడు. కానీ మైదానంలో కాస్త దూకుడు కనిపిస్తుంటుంది. ఇది తమ మాజీ కెప్టెన్లు రోహిత్, విరాట్ల మాదిరిగానే ఉంటుంది. అందుకే ఆ ఇద్దరి వ్యవహారశైలి కలిస్తే గిల్ అని నేను భావిస్తాను. తను కూడా వారి నుంచి ఎంతో నేర్చుకున్నాడు. కానీ ఆటపై తన సొంత ముద్ర కూడా ఉంటుంది. క్రీజులో ఉండే సమయంలో గిల్ కేవలం బ్యాటర్గానే ఆలోచిస్తాడు. ఆ తర్వాత మాత్రం కెప్టెన్సీపై దృష్టి సారించాలనుకుంటాడు. ఇలా రెండు పాత్రలకు న్యాయం చేయాలని ప్రయత్నిస్తాడు’ అని బట్లర్ వివరించాడు. ఐపీఎల్లో గుజరాత్ టైటాన్స్ కెప్టెన్గా ఉన్న గిల్ ఆధ్వర్యంలోనే బట్లర్ ఆడుతున్న విషయం తెలిసిందే. కాగా ఈ సిరీస్లో ఇంగ్లండ్నే విజయం వరిస్తుందని ఆ దేశ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అభిప్రాయపడ్డాడు.
అతను నాకంటే 20 ఏళ్లు చిన్నోడు
ఐపీఎల్లో 35 బంతుల్లోనే సెంచరీ చేసిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఓ ప్రత్యేక ఆటగాడని బట్లర్ తెలిపాడు. ‘రాజస్థాన్ తరఫున అతడు మా జట్టుపైనే చెలరేగి లీగ్లో రెండో ఫాస్టెస్ట్ శతకం సాధించాడు. అతడి ఆట స్ఫూర్తిదాయకంగానే కాకుండా చూసేందుకు ఉల్లాసంగా ఉంటుంది. తను నాకంటే 20 ఏళ్లు చిన్నవాడు. అలాంటి వ్యక్తి మైదానం నలువైపులా భారీ షాట్లతో హోరెత్తించాడు. నేను చూసిన ఆటగాళ్లలో అతడే అత్యుత్తమం అనిపించాడు. ఆ తర్వాత సీఎస్కే పైనా ఎలాంటి జంకు లేకుండా జడేజా, అశ్విన్ ఓవర్లలో సిక్సర్లు బాదాడు’ అని బట్లర్ గుర్తుచేశాడు.
ఇవీ చదవండి:
గిల్-పంత్తో కోహ్లీ మీటింగ్
బుమ్రా సంచలన వ్యాఖ్యలు
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి