మొదలైంది డబ్ల్యూటీసీ రేసు
18-06-2025 08:18:32
2: SPORTS

OFM , Publish Date - Jun 18 , 2025 | 05:55 AM

రాబోయే రెండేళ్ల కోసం సరికొత్త వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) సైకిల్‌ మంగళవారం నుంచి ఆరంభమైంది. ఇందులో భాగంగానే శ్రీలంక-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య తొలి టెస్టు...

18 టెస్టులు ఆడనున్న భారత్‌

2025-2027 షెడ్యూల్‌

దుబాయ్‌: రాబోయే రెండేళ్ల కోసం సరికొత్త వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) సైకిల్‌ మంగళవారం నుంచి ఆరంభమైంది. ఇందులో భాగంగానే శ్రీలంక-బంగ్లాదేశ్‌ జట్ల మధ్య తొలి టెస్టు జరుగుతోంది. ఇటీవల లార్డ్స్‌ మైదానంలో ఆస్ట్రేలియాను నాలుగు రోజుల్లోనే మట్టి కరిపించి దక్షిణాఫ్రికా తొలిసారి వరల్డ్‌ టెస్టు చాంపియన్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఆ పోరుతో 2023-2025 డబ్ల్యూటీసీ సీజన్‌ ముగిసింది. ఇక నాలుగో ఎడిషన్‌ కోసం మొత్తం తొమ్మిది జట్లు (భారత్‌, ఆస్ర్టేలియా, న్యూజిలాండ్‌, ఇంగ్లండ్‌, పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌) పోటీపడుతున్నాయి. మరోవైపు అఫ్ఘానిస్థాన్‌, ఐర్లాండ్‌, జింబాబ్వే జట్లు ఆడే టెస్టులు మాత్రం డబ్ల్యూటీసీ కిందికి రావు.

ప్రతీ జట్టుకు ఆరు సిరీ్‌సలు: డబ్ల్యూటీసీలో ప్రతీ జట్టు ఇంటా, బయటా కలిపి ఆరు సిరీస్‌లు ఆడుతుంది. ప్రతీ సిరీస్‌ కూడా రెండు నుంచి ఐదు టెస్టుల మధ్య ఉంటుంది. విజయాల ద్వారా గెలుచుకున్న పాయింట్లను బట్టి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్ల మధ్య ఫైనల్‌ జరుగుతుంది. మొత్తంగా రెండేళ్లలో ఈ తొమ్మిది జట్లు 27 సిరీ్‌సల్లో తలపడుతాయి. ఇంగ్లండ్‌ అత్యధికంగా 21 మ్యాచ్‌లు ఆడనుండగా.. ఆ తర్వాత ఆసీస్‌ (20), ఇండియా (18) ఉన్నాయి. ఇందులో గిల్‌ సేన స్వదేశంలో తొమ్మిది టెస్టులు మాత్రమే ఆడనుంది.

నాలుగు రోజుల టెస్ట్‌లకు

ఐసీసీ ఓకే.. కానీ!

లండన్‌: నాలుగు రోజుల టెస్ట్‌లకు ఐసీసీ సుముఖత వ్యక్తం చేసిందని సమాచారం. అయితే, చిన్న జట్లకు మాత్రమే ఇది వర్తించనుంది. 2027-29 వరల్డ్‌ టెస్ట్‌ చాంపియన్‌షి్‌ప (డబ్ల్యూటీసీ) సీజన్‌లో చిన్న దేశాలు ఎక్కువ టెస్ట్‌లు ఆడేందుకు అనుగుణంగా టెస్టు ఫార్మాట్‌లో ఓ రోజును తగ్గించనున్నారు. కానీ, భారత్‌, ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్లు సంప్రదాయ రీతిలో ఐదు రోజుల ఫార్మాట్‌లోనే ఆడాల్సి ఉంటుంది. ద్వైపాక్షిక సిరీ్‌సలో భాగంగా నాలుగు రోజుల టెస్ట్‌లకు ఐసీసీ 2017లోనే అనుమతించింది. ‘ఐదు రోజులపాటు మ్యాచ్‌ను నిర్వహించడం చిన్నజట్లకు భారంగా మారింది. ఖర్చు పెరుగుతుండడంతో ఆయా జట్లు అనాసక్తిని ప్రదర్శిస్తున్నాయి. కొత్త ఫార్మాట్‌లో అయితే వేగంగా సిరీస్‌ ముగిసే అవకాశాలుంటాయ’ని ఐసీసీ వర్గాలు తెలిపాయి. కాగా, 2025-27 డబ్ల్యూటీసీ సైకిల్‌లో మాత్రం ఐదు రోజుల మ్యాచ్‌లే జరగనున్నాయి.

ఇవీ చదవండి:

గిల్-పంత్‌తో కోహ్లీ మీటింగ్

బుమ్రా సంచలన వ్యాఖ్యలు

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

**** ONGOLE FIRST MEDIA ****