2: ANDHRA-PRADESH
OFM
, Publish Date - Jun 18 , 2025 | 01:36 AM
మహిళల వన్డే క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్లకు విశాఖ రెండోసారి ఆతిథ్యమివ్వనుంది.
వన్డే వరల్డ్ కప్నకు విశాఖ ఆతిథ్యం
ఏసీఏ వీడీసీఏ స్టేడియం వేదికగా ఐదు మ్యాచ్లు
ఆస్ర్టేలియా, దక్షిణాఫ్రికా జట్లతో తలపడనున్న భారత్
విశాఖపట్నం స్పోర్ట్సు, జూన్ 17 (OFM):
మహిళల వన్డే క్రికెట్ వరల్డ్ కప్ మ్యాచ్లకు విశాఖ రెండోసారి ఆతిథ్యమివ్వనుంది. భారత్, శ్రీలంక సంయుక్తంగా నిర్వహిస్తున్న మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీలో ఆతిథ్య భారత్, శ్రీలంకతోపాటు ఆస్ర్టేలియా, దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్, బంగ్లాదేశ్, పాకిస్థాన్, ఇంగ్లండ్...మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి. సెప్టెంబరు 30 నుంచి నవంబరు 2 వరకు రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరిగే ఈ టోర్నీలో మొత్తం 31 మ్యాచ్లు జరగనున్నాయి. వీటిలో ఐదు మ్యాచ్లకు నగరంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదిక కానుంది. వీటిలో భారత్ జట్టు రెండు మ్యాచ్లలో ఆస్ర్టేలియా, దక్షిణాఫ్రికాలతో తలపడనుంది. మిగిలిన మూడు మ్యాచ్లు న్యూజిలాండ్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికా, ఆస్ర్టేలియా జట్ల మధ్య జరగనున్నాయి.
1996లో భారత్, శీలంక, పాకిస్థాన్ సంయుక్తంగా నిర్వహించిన పురుషుల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్లకు విశాఖ ఆతిథ్యమిచ్చింది. 1996 ఫిబ్రవరి 23న ఆస్ర్టేలియా, కెన్యా జట్ల మధ్య జరిగిన వన్డే మ్యాచ్కు నగరంలోని ఇందిరా ప్రియదర్శిని మునిసిపల్ స్టేడియం వేదికైంది. ఈ ఏడాది జరగనున్న మహిళల వన్డే వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా అక్టోబరు 9న ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్ మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది.
విశాఖలో మ్యాచ్ల షెడ్యూల్
అక్టోబరు 9న భారత్-దక్షిణాఫ్రికా; అక్టోబరు 10న న్యూజిలాండ్-బంగ్లాదేశ్; అక్టోబరు 12న భారత్-ఆస్ర్టేలియా; అక్టోబరు 13న దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్; అక్టోబరు 16న ఆస్ర్టేలియా-బంగ్లాదేశ్ తలపడతాయి.
వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలు
ఆర్డీ కార్యాలయ పరిధిలో 350 మందికి స్థానచలనం
విశాఖపట్నం, జూన్ 17 (OFM):
వైద్య, ఆరోగ్య శాఖలో బదిలీల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రాంతీయ కార్యాలయ పరిధిలో తొలిరోజు మొత్తం 12 కేడర్లకు చెందిన 350 మంది ఉద్యోగులను బదిలీ చేశారు. ఇందులో సుమారు 200 మంది స్టాఫ్ నర్సులు, 60 మంది హెడ్ నర్సులతోపాటు డిప్యూటీ డెమోలు, నర్సింగ్ సూపరింటెండెంట్లు, పీహెచ్ఎన్ (టీచింగ్), సీనియర్ ఫార్మసిస్టు వంటి కేడర్లకు చెందిన ఉద్యోగులు ఉన్నారు. ఐదేళ్లు పూర్తయిన ఉద్యోగులందరికీ స్థానచలనం కల్పించారు. ఆన్లైన్లో కౌన్సెగ్ను ఆర్డీ ాక్టర్ రాధారాణి, డీడీ శ్రీనివాస్కుమార్, ఇతర సిబ్బంది నిర్వహించారు.
ఏయూలో వరుస చోరీలు
కొద్దిరోజుల కిందట కంప్యూటర్ సైన్స్ విభాగంలో కాఫర్ వైర్ మాయం
తాజాగా యోగా విలేజ్లో మైక్ సెట్, ఎలక్ర్టానిక్ పరికరాలు చోరీ
విశాఖపట్నం, జూన్ 17 (OFM):
ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని పలు విభాగాల్లో చోరీలు జరుగుతున్నాయి. కొద్దిరోజుల కిందట కంప్యూటర్ సైన్స్ విభాగంలో కాపర్ వైర్ పోయింది. దీని విలువ భారీగా ఉంటుందని చెబుతున్నారు. ఆ విషయం ఉన్నతాధికారులు దృష్టికి కూడా వెళ్లింది. అక్కడ పనిచేసే కొందరు సెక్యూరిటీ సిబ్బంది చేతివాటంగా అనుమానించారు. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు మౌనాన్ని దాల్చడంపై విమర్శలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఏయూ యోగా విలేజ్లో మరో చోరీ జరిగింది. యోగా శిక్షణ కోసం వినియోగించే కొన్నిరకాల ఎలక్ర్టికల్ పరికరాలు చోరీకి గురైనట్టు చెబుతున్నారు. మైక్ సెట్, సెటాప్ బాక్స్తోపాటు మరికొన్ని ఎలక్ర్టానిక్ పరికరాలు పోయాయంటున్నారు. ఈ మేరకు వర్సిటీ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఇదిలావుంటే సెక్యూరిటీ సూపర్వైజర్గా ఉన్న ఒకరిపై తీవ్ర ఆరోపణలు వినిపిస్తున్నాయి. విధుల కేటాయింపులో కీలకంగా వ్యవహరించే సదరు ఉద్యోగికి భారీగా సమర్పించుకోవాల్సి వస్తోందని గార్డులు వాపోతున్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు వసూలు చేసి, గతంలో విధుల నుంచి తొలగింపునకు గురైన గార్డును మళ్లీ తీసుకున్నట్టు చెబుతున్నారు. వర్సిటీ సెక్యూరిటీ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.